తిరుపతి : హెరిటేజ్ ను లాభాల బాటలో నడిపిస్తూ ప్రభుత్వ పాల డెయిరీలను సీఎం చంద్రబాబు మూయిస్తున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా సహకార చక్కెర ఫ్యాక్టరీలకు, నూలు మిల్లులకు ప్రాణ గండం తప్పదని విమర్శించారు. గాజులమండ్యంలోని ఎస్వీ ఘగర్ ఫ్యాక్టరీని పునః ప్రారంభించేంత వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని ఆయన తెలిపారు.