కోల్కతా: కోల్కతా మెడికల్ కాలేజీ, హాస్పిటల్లో ఇవాళ ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. వైద్య కళాశాలలోని ఫార్మసీ డిపార్ట్మెంట్లో మంటలు చెలరేగాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆస్పత్రిలోని సుమారు 250 మంది పేషెంట్లను సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్నారు. ఆస్పత్రిలోని రోగులు క్షేమంగానే ఉన్నట్లు అధికారులు తెలిపారు.
10 ఫైరింజన్లు మంటలార్పుతున్నాయి. మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు సహాయక సిబ్బంది శ్రమిస్తున్నారు. ఫార్మసీ డిపార్ట్మెంట్ నుంచి పొగలు రావడాన్ని గుర్తించిన కొంతమంది తమ ప్రాణాలు కాపాడుకునేందుకు కిటికీల్లోంచి దూకినట్లు వారు చెప్పారు. కదల్లేని పరిస్థితుల్లో ఉన్న రోగులు సహాయం కోసం వేచి చూస్తున్నారు. ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించి అధికారులు ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.