చెన్నై: ఏసీ గ్యాస్ లీకై అది పీల్చడం వల్ల ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. ఈ విషాద సంఘటన తమిళనాడు కోయంబేడు నగరం తిరువల్లువార్ ప్రాంతంలో సోమవారం అర్థరాత్రి చోటుచేసుకుంది. ఇంట్లోంచి వ్యక్తులు ఎంతకి బయటకి రాకపోవడంతో అనుమానం వచ్చిన పొరిగింటివారు పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు వచ్చి తలుపులు పగలగొట్టి చూడగా 35 ఏండ్ల వ్యక్తి అతని భార్య, కొడుకు విగతజీవులుగా పడిఉన్నారు. పోలీసులు స్పందిస్తూ.. స్థానికంగా పవర్కట్ వల్ల ఇన్వర్టర్ ఆన్చేసి పడుకున్నారు. అర్థరాత్రి పవర్ సైప్లె పునరుద్ధరించబడింది. అప్పటికే ఎయిర్ కండిషనర్లోని గ్యాస్ లీకై ముగ్గురు చనిపోయారని పేర్కొన్నారు.