ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అక్టోబర్‌ నెలాఖరులో రాజమండ్రిలో బీసీ గర్జన భారీ బహిరంగ సభ : మంత్రి కళా వెంకట్రావు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 21, 2018, 02:32 PM

కాకినాడ : రాజమహేంద్రవరంలో అక్టోబర్‌ నెలాఖరున బీసీ గర్జన భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు మంత్రి కళావెంకట్రావు తెలిపారు. శుక్రవారం జిల్లా టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో కాకినాడలోని పార్టీ కార్యాలయంలో ప్రారంభమయ్యింది. ఈ సమావేశానికి మంత్రులు కళా వెంకట్రావు, చినరాజప్ప, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కళా మాట్లాడుతూ లాలా చెరువు వద్ద జాతీయ రహదారిని ఆనుకుని బీసీ గర్జన సభకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రాన్ని మోసం చేసిన బీజేపీను రాష్ట్ర ప్రజలు ఏ విధంగా నమ్మాలి అంటూ ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com