కాకినాడ : రాజమహేంద్రవరంలో అక్టోబర్ నెలాఖరున బీసీ గర్జన భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు మంత్రి కళావెంకట్రావు తెలిపారు. శుక్రవారం జిల్లా టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో కాకినాడలోని పార్టీ కార్యాలయంలో ప్రారంభమయ్యింది. ఈ సమావేశానికి మంత్రులు కళా వెంకట్రావు, చినరాజప్ప, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కళా మాట్లాడుతూ లాలా చెరువు వద్ద జాతీయ రహదారిని ఆనుకుని బీసీ గర్జన సభకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రాన్ని మోసం చేసిన బీజేపీను రాష్ట్ర ప్రజలు ఏ విధంగా నమ్మాలి అంటూ ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు.