విజయవాడ, మేజర్న్యూస్ : మహిళలు అన్ని రంగాలలో ఆర్థికా భివృద్ధి సాధించాలని కోరుకుం టున్నట్లు ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత స్పష్టం చేశారు. అంతర్జా తీయ మహిళా దినోత్సవం సందర్భంగా బుధవారం ప్రజా ప్రతినిధులు, మహిళా ఉద్యోగుల సమక్షంలో మంత్రి సునీత కేక్ కట్ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రగతిపధంలో మహిళ ముందడుగు వేస్తూ అన్ని రంగాల్లో రాణిస్తోందని చెప్పారు. మహిళా సాధికా రత, స్వేచ్ఛ, స్త్రీ పురుష సమానతల వల్ల మాత్రమే భారతదేశంలో స్త్రీలకు తగిన గౌరవం సమకూరుతుందన్నారు. దేశకీర్తి ప్రతిష్ఠలను మహిళలు నలుమూలల విస్తరింపచేయగలరని అన్నారు. మహిళలకు అధిక ప్రాధాన్యం ఇస్తూ అన్ని రంగాలలో అవకాశాలు కల్పిస్తున్న ముఖ్యమంత్రి చంద్రన్నకు మహిళా లోకం తరపున దన్యవాదాలు తెలుపు తున్నట్లు మంత్రి సునీత తెలిపారు.