తిరుపతి, మేజర్న్యూస్ : టిటిడి ఆధ్వర్యంలో తిరుపతిలోని మహతి కళా క్షేత్రంలో బుధవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వ హించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను విశేషంగా ఆకట్టుకు న్నాయి. ఈ సందర్భంగా శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ మరియు పిజి కళాశాల అధ్యాపకులు శ్రీనివాస కల్యాణం నృత్య రూపకం ప్రదర్శించారు. టిటిడి మహిళా ఉద్యోగులు సాంప్రదాయ వస్త్ర ప్రదర్శన నిర్వహించారు. ఎస్.వి. సంగీత నృత్య కళాశాల ఆధ్వర్యంలో చక్కని తల్లికి ఛాంగుబళా, తిరుతిరునాల దిక్ దిక్తై'' నాట్య ప్రదర్శన ఆకట్టుకుంది. టిటిడి మహిళా దినోత్సవం కమిటీ సభ్యులు జ్యోతుల ప్రదర్శన నిర్వహించారు. అనంతరం టిటిడి ఆడిట్ విభాగం ప్రదర్శించిన ''గడసరిఅత్త - సొగసరి కోడలు'' నాటకం మహిళలను విశేషం గా ఆకట్టుకుంది.