కాపు ఉద్యమంలో ఆఖరిఘట్టం జరుగుతోందని, సవరణలతో కూడిన కొత్తబిల్లును అసెంబ్లీలో ఆమోదించాలని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం డిమాండ్ చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, త్వరలో రానున్న నలభై వేల ఉద్యోగాల నోటిఫికేషన్ లో తమ వాటా 5 శాతం రిజర్వేషన్ దక్కేలా చూడాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్ల విషయంలో ఇతర కులాలతో తమకు పోటీ లేదని, ఇతర బీసీలకు రిజర్వేషన్లు పెంచాల్సిన అవసరముందని ముద్రగడ అభిప్రాయపడ్డారు.