గుంటూరు : ఆరునెలల్లో గురుకుల పాఠశాలను పూర్తిచేసి ప్రారంభోత్సవం చేస్తామని మంత్రి గంటా శ్రీనివాస్ అన్నారు. రాజాపేటలో గురుకుల పాఠశాలకు మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, గంటా శ్రీనివాసరావులు శంకుస్థాపన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధికశాతం బడ్జెట్ కేటాయస్తోందన్నారు. ప్రభుత్వం విద్యకు ఏటా రూ.25వేలకోట్లు ఖర్చు చేస్తోందన్నారు. గురుకుల పాఠశాలలో 21వేల మంది విద్యార్థులు విద్యనభ్యసస్తున్నారన్నారు.