కర్నూలు : వ్యవసాయం రంగంలో ఏపీ దేశంలోనే ముందుందని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. కర్నూలులో ఆయన మాట్లాడుతూ… మొక్కజొన్నను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసిందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కేంద్రం 70శాతం ధాన్యం కొనుగోలు చేసిందన్నారు. కానీ ఏపీలో మాత్రం 20 శాతం కూడా కొనలేదని మంత్రి అన్నారు. అర్హులైన రైతులందరికీ రుణవిముక్తి చేస్తున్నట్లు తెలిపారు. కరువు మండలాల్లో ఉచితంగా విత్తనాలు పంపిణీ చేస్తున్నామన్నారు.