వాల్మీకి ఫెడరేషన్ డైరెక్టర్ కప్పట్రాళ్ళ బొజ్జమ్మ మంగళవారం ఏపీ సీఎం చంద్రబాబునాయుడుని అమరావతిలో ఆయన ఛాంబర్లో కలిశారు. చంద్రబాబునాయుడికి ఆమె పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా సీఎం ఆమెతో కొద్దిసేపు మాట్లాడి నియోజకవర్గంలో విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తుగ్గలి నాగేంద్ర, బి.టినాయుడు, రామచంద్రనాయుడు పాల్గొన్నారు.