హైదరాబాద్: సుకుమార్-రామ్చరణ్ కాంబినేషన్లో వస్తున్న చిత్రంలో కథానాయికగా సమంతను ఎంచుకున్నారు. ఈ చిత్రంలో కథానాయికగా గతంలో అనేక పేర్లు వినిపించినా, చివరికి సమంతను తీసుకున్నట్లు పుకార్లు వచ్చాయి. అయితే ఈ విషయాన్ని నిర్ధారిస్తూ.. సోమవారం చిత్ర బృందం ప్రకటన విడుదల చేసింది. మార్చి 20న సినిమా షూటింగ్ ప్రారంభమౌతుందని, మార్చి 22 నుంచి సమంత చిత్రీకరణలో పాల్గొంటారని తెలిపింది. జులై చివరికి సినిమా షూటింగ్ పూర్తి చేయాలని సుకుమార్ భావిస్తున్నట్లు పేర్కొంది. దేవిశ్రీ ప్రసాద్ సినిమా పాటల పనులు పూర్తి చేశారని వెల్లడించింది.పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఇందులో రామ్చరణ్ కొత్త అవతారంలో కనిపించబోతున్నారు. నటుడు వైభవ్ ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించనున్నారు.