అమరావతి : కేంద్ర ప్రభుత్వంపై టిడిపి సహా ప్రతిపక్షాలు ఇచ్చిన అవిశ్వాసంపై చర్చకు ఆమోదం లభించడంతో తెలుగుదేశం అధిష్టానం చకచకా పావులు కదుపుతోంది. తమ పార్టీ ఎంపిలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. ఢిల్లి పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తోంది. బిజెపిలోని అసంతృప్తులతో టచ్లో ఉండే అంశంపై టిడిపి అధిష్టానం చర్చిస్తోంది. అలాగే ప్రధాని మోడీ వ్యతిరేకుల మద్దతు కూడగట్టే దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని వివరించడంతోపాటు బిజెపికి గట్టిగా కౌంటర్ ఇచ్చే దిశగా టిడిపి ప్రణాళికలు రచిస్తోంది.