న్యూఢిల్లీ : రాజ్యసభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన సభ్యులు ప్రమాణస్వీకారం చేసిన అనంతరం.. ఇటీవల మృతి చెందిన సభ్యులకు, ప్రముఖులకు సభ సంతాపం ప్రకటించారు. అనంతరం అవిశ్వాస తీర్మానంపై చర్చ చేపట్టాలని టీడీపీ సభ్యులు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ టీడీపీ సభ్యులు నిరసనకు దిగారు. దీంతో సభకు అంతరాయం కలగడంతో సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు వెంకయ్య నాయుడు ప్రకటించారు.