లోక్సభ : లోక్సభలో విపక్షాల నినాదాలు, గందరగోళం మధ్యే స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రశ్నోత్తరాల కార్యక్రమం చేపట్టారు. ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వాలని, న్యాయం చేయాలని నినాదాలు హోరెత్తుతున్నప్పటికీ ప్రశ్నోత్తరాల కార్యక్రమం నిర్వహిస్తున్నారు. లోక్సభలో టిడిపి ఎంపిలు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పించాలని నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. అవిశ్వాస తీర్మానంపై చర్చకు వారు పట్టుబట్టారు. ఎపికి న్యాయం చేయాలంటూ విపక్ష సభ్యులు నినాదాలు చేస్తున్నారు. ఏ అంశంపై అయినా ప్రశ్నోత్తరాల కార్యక్రమం తరువాతే చర్చకు అనుమతిస్తానని స్పీకర్ స్పష్టం చేశారు.