రానున్న ఎన్నికల్లో కర్నూలు జిల్లా ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రకటనపై అప్పుడే టీడీపీలో ముసలం రాజుకుంది. మంత్రి నారా లోకేశ్ ...అభ్యర్థులను ప్రకటించడంపై ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ స్పందించారు. ‘అభ్యర్థులను లోకేశ్ ప్రకటించడం షాక్కు గురి చేసింది. ఆయన పార్టీ అధ్యక్షుడు కూడా కాదు. అధికార కార్యక్రమంలో పార్టీ అభ్యర్థులన లోకేశ్ ఎలా ప్రకటిస్తారు. తెలుగుదేశం పార్టీ బీఫాం ఇచ్చే ముందు కూడా నిర్ణయాలు మార్చుకుటుంది. మరి అలాంటిది మంత్రి లోకేశ్ ఎలా అభ్యర్థులను ప్రకటించారో అంతుచిక్కడం లేదు. మరి ఎస్వీ మోహన్ రెడ్డి... లోకేశ్ను హిప్నటైజ్ చేశారేమో. మా మోహన్ రెడ్డి ఏమైనా చేయగలడు.’ అని టీజీ వెంకటేశ్ వ్యాఖ్యలు చేశారు.
కాగా కర్నూలు ఎంపీ అభ్యర్థిగా బుట్టా రేణుకా, ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎస్వీ మోహన్ రెడ్డిని రెండు రోజుల క్రితం నారా లోకేశ్ జిల్లా పర్యటన సందర్భంగా ప్రకటన చేశారు. వీరిద్దర్నీ వచ్చే ఎన్నికల్లో వీరిద్ధర్నీ భారీ మెజార్టీతో గెలిపించాలని కోరిన విషయం తెలిసిందే.