ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ఈరోజు సమావేశంకానుంది. నిరుద్యోగ భృతి మార్గదర్శకాలపై కేబినెట్లో కీలకంగా చర్చించనున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఏపీకి విభజన చట్టంలో ఉన్నవి అన్నీ అమలు చేశామని కేంద్రప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ సమర్పించడంపై మంత్రివర్గంలో ప్రధాన అంశంగా చర్చిస్తామన్నారు. కేంద్రం వేసిన అఫిడవిట్కు కౌంటర్ అఫిడవిట్ వేయడంపై మంత్రివర్గంలో నిర్ణయం తీసుకోనున్నట్లు వారు తెలిపారు.