జమ్మూకాశ్మీర్ః సోఫియాన్ జిల్లా కచ్దూరా ప్రాంతంలో గురువారం ఉగ్రవాదులు కిడ్నాప్ చేసిన కానిస్టేబుల్ జావెద్ అమ్మద్ దార్ దారుణహత్యకు గురయ్యాడు. శుక్రవారం ఉదయం కుల్గాం పరిసరాల్లో కానిస్టేబుల్ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతుడి శరీరమంతా బుల్లెట్లతో ఛిద్రమై ఉన్నట్లు వారు వెల్లడించారు. అటు పుల్వామా జిల్లా పరిగాంలో ఓ మసీదులో ఉగ్రవాదుల కాల్పుల్లో ఓ పౌరుడు తీవ్రంగా గాయపడ్డాడు.