కడప ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఎంపీ మురళీమోహన్ అన్నారు. ఈరోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మాట్లాడారు. ఇటీవల వెంకన్న చౌదరి అంటూ నోరు జారానని, దేవుడికి కులాన్ని ఆపాదించే వ్యక్తిని కానన్నారు. నోరు జారినందుకు అందరినీ క్షమించాలని కోరుతున్నానన్నారు. కడప ఉక్కు ఆంధ్రుల హక్కు అని, ఉక్కు పరిశ్రమ కోసం ఎంపీ సి.ఎం.రమేష్ చేస్తున్న పోరాటం విజయవంతం కావాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు.