అమరావతి : దళితులను అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి నక్కా ఆనంద్ బాబు అన్నారు. సచివాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ…. గురుకుల పాఠశాలల్లో అన్ని వసతులు కల్పిస్తున్నామన్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్దిని, సంక్షేమ పథకాలను చూసి వైసీపీ ఓర్వలేకపోతోందన్నారు. మంచి పనిచేసినా ప్రతిపక్షం విమర్శలు చేస్తుందన్నారు.