తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామి వారి దర్శనానికి భక్తులకు 24 గంటల సమయం పడుతోంది. 29 కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. నడక దారి భక్తులకు స్వామి వారి దర్శనానికి మూడు గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు కూడా స్వామి వారి దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది.