అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మీడియా సలహాదారు పదవికి పరకాల ప్రభాకర్ రాజీనామా చేశారు. ఇటీవల ప్రతిపక్ష నేత జగన్ చేసిన వ్యాఖ్యలతో మనస్తాపం చెందిన పరకాల తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ముఖ్యమంత్రి చంద్రబాబుకు పంపించారు. వెంటనే తన రాజీనామాను ఆమోదించాలని ఆయన కోరారు. కొన్ని రోజులుగా చేస్తున్న నిందా ప్రచారంపై కలత చెందానని పరకాల తన లేఖలో పేర్కొన్నారు.