న్యూఢిల్లి : అంతా మంచికే జరిగిందని కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ అన్నారు. జమ్ము కాశ్మీర్లో ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుని పిడిపినుంచి బిజెపి వైదొలగడంపై ఆజాద్ పైవిధంగా స్పందించారు. బిజెపి రాష్ట్రాన్ని పూర్తిగా నాశనం చేసిందని, ఇప్పుడు ప్రభుత్వంనుంచి వైదొలగిందని ఆయన అన్నారు. గత మూడేళ్లలో అనేకమంది పౌరులు, సైనికులు హతమయ్యారని ఆయన గుర్తు చేశారు. పిడిపితో పొత్తు పెట్టుకునే ప్రశ్న ఉత్పన్నం కాదని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.