విజయవాడ : అగ్రిగోల్డ్ నిందితులకు ఇక్కడి కోర్టు బెయిల్ ఇవ్వడానికి తిరస్కరించింది. ఈ కేసులో ఎ5, ఎ9 నిందితులకు కొద్ది రోజుల క్రితం బెయిల్ మంజూరయింది. కాగా ఎ8, ఎ10, ఎ11, ఎ14 నిందితుల బెయిల్ దరఖాస్తులను న్యాయమూర్తి తిరస్కరించారు. ఛార్జిషీట్కు గడువు ఉండటంతో బెయిల్ను తిరస్కరించారు.