న్యూఢిల్లీ : నీతీ ఆయోగ్ పాలక మండలి సమావేశంలో చంద్రబాబు ప్రసంగాన్ని కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ అడ్డుకున్నారు. సమావేశంలో తొలుత ఏపీ సీఎం చంద్రబాబు ప్రసంగించారు. ఈ ప్రసంగంలో చంద్రబాబు కేంద్రం తీరును అడ్డుకున్నారు. రాజథాని అమరావతి నిర్మాణానికి నిథులు, పోలవరం ప్రాజెక్టు వ్యయం, కేంద్రం నుంచి రావలసిన నిధులు, విభజన హామీలను విస్మరించిన తీరు ఇలా వరుస పెట్టి కేంద్రం ఏపీకి చేసిన అన్యాయాలపై దాదాపు 20 నిముషాల పాటు చంద్రబాబు ప్రసంగించారు. ఆయన ప్రసంగస్తుండగా ఏడు నిముషాల తరువాత చంద్రబాబు ప్రసంగానికి కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ అడ్డుతగిలారు. సమయం ముగిసింది…ప్రసంగం ఆపేయాలని రాజ్ నాథ్ అన్నారు. అయినా చంద్రబాబు ఆగకుండా దేశంలోనే ఏపీ సమస్యలు ప్రత్యేకమైనవని గట్టిగా చెప్పి తన ప్రసంగాన్ని కొనసాగించారు.