అమరావతి : పోలవరం ప్రాజెక్టు కోసం రాష్ట్ర మంత్రి దేవినేని ఉమ ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గ గుడిలో ఈ రోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నడక మార్గంలో ఇంద్రకీలాద్రి చురుకున్న మంత్రి ఉమ అమ్మవారికి బోనాలు సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసి, కరవు ఛాయలను కూడా రాష్ట్రం దరి చేరనీయకుండా చేసే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం త్వరితగతిన పూర్తి కావాలని దుర్గమ్మను పూజించినట్లు ఉమ విలేకరులకు చెప్పారు.