ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేంద్రం లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయాన్ని రాజకీయ అవసరాలకు వాడుకుంటోంది :చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 15, 2018, 05:26 PM

అమరావతి : ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయాన్ని కేంద్రం తన రాజకీయ అవసరాలకువాడుకుంటోందని ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అన్నారు. నీతి ఆయోగ్ సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై కేజ్రీవాల్ తో ఫోన్ లో సంభాషించిన చంద్రబాబు ఢిల్లీ సర్కార్ ఆందోళనకు పూర్తి మద్దతు ప్రకటించారు. ఢిల్లీ ప్రభుత్వోద్యోగుల సహాయ నిరాకరణ వెనుక లెఫ్టింనెంట్ గవర్నర్ హస్తం ఉందని ఆరోపిస్తూ కేజ్రీవాల్ గత ఐదు రోజులుగా రాజ్ నివాస్ లో బైఠాయించి ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. కేజ్రీవాల్ పోరాటానికి చంద్రబాబు సంఘీ భావం ప్రకటిస్తూ ట్వీట్ చేశారు. గవర్నర్ కార్యాలయాన్ని కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ రాజకీయ అవసరాల కోసం  వాడుకోవడం రాజ్యాంగ విరుద్ధమని చంద్రబాబు పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com