ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కడప స్టీల్‌ ప్లాంట్‌ సాధ్యం కాదని సుప్రీం కోర్టుకు కేంద్రం చెప్పలేదు: కన్నా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jun 14, 2018, 02:28 PM

ఢిల్లీ  కడప స్టీల్‌ ప్లాంట్‌ సాధ్యం కాదని సుప్రీం కోర్టుకు కేంద్రం చెప్పలేదని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఈరోజిక్కడ ఆయన మాట్లాడుతూ మెకాన్‌ సంస్థతో అధ్యయనం చేయించారన్నారు. మెకాన్‌ సంస్థతో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సమాలోచనలు జరిపాయని పేర్కొన్నారు. సాధ్యాసాధ్యాలపై నివేదికలు తయారు చేయాలని టాస్క్‌ఫోర్స్‌ నిర్ణయించిందన్నారు. ఏపీ ప్రభుత్వం తన బాధ్యతను నిర్వర్తించడం లేదని, అందుకే ప్లాంట్‌ ఆలస్యమవుతోందన్నారు. కేంద్ర ఉక్కుశాఖ సుప్రీంకు ఇచ్చిన అఫిడవిట్‌లో స్పష్టంగా ఉందన్నారు. టీడీపీ నేతలు నాటకాలు ఆపాలన్నారు. ఎవరూ ప్రాణ త్యాగం చేయనవసరం లేదన్నారు. 2019లో మమ్మల్ని దోషిగా చూపి ఎన్నికలకు వెళ్లాలని టీడీపీ ప్రయత్నం చేస్తోందని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు.  కడపలో స్టీల్‌ ప్లాంట్‌ సాధ్యం కాదని సెయిల్‌ సంస్థ 2014లో రిపోర్ట్‌ ఇచ్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాల అభ్యర్థన మేరకు అమిత్‌షా చొరవ తీసుకున్నారన్నారు. ప్రధానిపై ఒత్తిడి తేవడంతో టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటైందని పేర్కొన్నారు. కడప స్టీల్‌ ప్లాంట్‌ను సాధించి తీరుతామని, అందులో అనుమానమొద్దన్నారు. స్టీల్‌ ప్లాంట్‌ ఇస్తామని అమిత్‌ షా మాతో చెప్పారని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com