విజయవాడ: పోలవరంపై జగన్కు అవగాహన లేదని మంత్రి దేవినేని ఉమ అన్నారు. విజయవాడలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పోలవరం డ్యామ్ సైట్లో 9వేల మంది ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు, కూలీలు పని చేస్తున్నారన్నారు. ఇన్ని వేల మంది పని చేస్తుంటే పోలవరం సినిమా చూపిస్తున్నారని జగన్ మాట్లాడుతున్నారని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టుపై ఏ మాత్రం అవగాహన లేని జగన్ మాట్లాడుతుంటే విడ్డూరంగా ఉందన్నారు. కార్మికుల, ఇంజనీర్ల కష్టాన్ని అమమానించేలా వైసీపీ వ్యాఖ్యలు చేస్తోందన్నారు. కొన్ని వందల మంది పోలవరం డ్యామ్ సైట్కు వెళ్లి ఆనందంగా వస్తూ సీఎంను ప్రశంసిస్తున్నారన్నారు.