న్యూఢిల్లీ: వాణిజ్య నౌక ఎస్ఎస్ఎల్ కోల్కతాలో అగ్ని ప్రమాదం జరిగింది. ఆ నౌకలో ఉన్న 22 మందిలో.. 11 మంది సిబ్బందిని కాపాడారు. భారత కోస్టు గార్డ్కు చెందిన రాజ్కిరణ్, కోస్ట్ డోర్నియర్లు ప్రమాదం జరిగిన ప్రాంతానికి వచ్చాయి. మిగతా సిబ్బంది కోసం రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. కొచ్చి తీరంలోనూ మరో ప్రమాదం జరిగింది. వాణిజ్య నౌక ఎంవీ నళిని కూడా మంటల్లో చిక్కుకుంది. ప్రమాదంలో తీవ్రంగా కాలిపోయిన ఓ ఉద్యోగి చనిపోయాడు. కొచ్చికి 14.5 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్నప్పుడు ఆ నౌకలో మంటలు చెలరేగాయి. బుధవారమే మంటల్ని అదుపులోకి తెచ్చారు. కెమికల్ ట్యాంకర్లో నాఫ్తాను తీసుకెళ్తున్నారు.