లక్నో: ఉత్తరప్రదేశ్లోని కన్నౌజ్ వద్ద ఆగ్రా- లఖ్నవూ ఎక్స్ప్రెస్వేపై సోమవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వస్తున్న ఓ బస్సు 9 మంది విద్యార్థులపై దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆరుగురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.