తిరుమల: తిరుమల కొండపై సోమవారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వ, నడకదారి భక్తులకు ఉదయం 8 గంటల నుంచి టైంస్లాట్ కింద టిటిడి భక్తులకు టోకెన్లు జారీ చేయనుంది. శ్రీవారి ఉచిత దర్శనానికి 24 గంటల సమయం పట్టనుంది. అలాగే శ్రీవారి టైం స్లాట్ సర్వదర్శనం, నడక, ప్రత్యేక ప్రవేశ దర్శనాలకు 3 గంటల సమయం పడుతోంది. ఆదివారం శ్రీవారికి హుండీ ద్వారా రూ.3.11కోట్ల ఆదాయం లభించింది. నిన్న శ్రీవారిని రికార్డులో స్థాయిలో 1,01,139 మంది భక్తులు దర్శించుకున్నారు.