మురుగదాస్ దర్శకత్వంలో మహేష్బాబు కథానాయకుడిగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. రకుల్ప్రీత్ సింగ్ కథానాయిక. ఎన్.వి.ప్రసాద్, ఠాగూర్ మధు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. హైదరాబాద్లోని ఓ స్టూడియోలో వేసిన భారీ సెట్లో మహేష్-విదేశీ భామలపై ఓ పాటని చిత్రీకరిస్తున్నారు. శోభి మాస్టర్ నృత్య దర్శకత్వం వహిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమాని జూన్ 23న తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ఉగాది పండగ సందర్భంగా సినిమా పేరును, ఫస్ట్లుక్ని, మే 31న పాటల్ని విడుదల చేసే అవకాశాలున్నాయి. మహేష్బాబు ఓ ఇంటెలిజెన్స్ అధికారి పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. సంగీతం: హారిస్ జైరాజ్, ఛాయాగ్రహణం: సంతోష్ శివన్