అమరావతి : ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం కొనసాగుతోంది. ఆంద్రప్రదేశ్ సచివాలయంలో సీఎం చంద్రబాబునాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశం నిర్వహించారు. జూన్ 2 నుండి 8 వరకు జరిగే నవనిర్మాణ దీక్షల నిర్వహణ, జూన్ నుండి ఇవ్వనున్న నిరుద్యోగ భృత్తి, అగ్రిగోల్డ్పై ప్రధానంగా చర్చించనున్నారు. అలాగే ఉద్యోగుల సీపీయస్ విధానం రద్దు, 216 అన్న క్యాంటిన్లపైనా చర్చ జరుగనుంది. 10వ పీఆర్సీ బకాయిలు, వివిధ సంస్థలకు భూకేటాయింపులపైనా కేబినెట్లో చర్చించనున్నారు.