కురుపాం : గిరిజనులు, సామాన్యుల సమస్యలను తెదేపా విస్మరించిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. విజయనగరం జిల్లా కురుపాంలోని సంతకూడలిలో నిర్వహించిన బహిరంగ సబలో పవన్ కల్యాణ్ పాల్గొని మాట్లాడుతూ… కురుపాంలో గిరిజనుల సమస్యలు తెలుసుకునేందుకే వచ్చానన్నారు. గిరిజన ప్రాంతాల్లో కనీస మౌలిక సదుపాయాల్లేవన్నారు.