ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీజేపీకి మిత్ర పక్షాలు అవసరం లేద : ఉద్ధవ్ థాక్రే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, May 31, 2018, 05:35 PM

ముంబై :  శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. బీజేపీకి మిత్ర పక్షాలు అవసరం లేదని ఆయన అన్నారు. ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన పాల్ఘర్ లో ఓటమిని అంగీకరించేందుకు తాము సిద్ధంగా లేమని స్పష్టం చేశారు. అక్కడ రీకౌంటింగ్ జరపాల్సిన అవసరం ఉందన్నారు. ఈవీఎంల లాంపరింగ్ జరిగిందని, బీజేపీ డబ్బులు పంచుతోందని తాము ఆధారాలతో సహా ఈసీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఉద్ధవ్ థాక్రే విమర్శించారు. పాల్ ఘర్ లో డబ్బులు పంచిన వారు ఇప్పుడు బీజేపీతో కలిసి సంబరాలు చేసుకుంటున్నారన్నారు. పాల్ ఘర్ లోక్ సభ స్థానం ఫలితాన్ని ప్రకటించవద్దని, ఈ లోక్ సభ స్థానంలో ఓట్లు మళ్లీ లెక్కించాలని ఈసీకి శివసేన కోరింది. పాల్ ఘర్ లోక్ సభ స్థానంలోని ఓట్ల లెక్కింపులో వ్యత్యాసాలు కనిపిస్తున్నాయన్నారు. ఆ స్థానంలో మళ్లీ ఓట్లు లెక్కించాలని డిమాండ్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com