శ్రీకాకుళం జిల్లాలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పర్యటనకు పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారు. పోలీసు బందోబస్తు కావాలని జనసేన నిన్న ఎస్పీకి దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలో బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. ఎస్పీ త్రివిక్రమ వర్మ పవన్ కల్యాణ్కు పోలీసు రక్షణ కల్పించేందుకు ఆదేశాలు జారీ చేశారు. గత కొన్ని రోజుల నుంచి పవన్ శ్రీకాకుళం జిల్లాలో పోరాట యాత్ర నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.