విజయవాడ: దక్షిణాది రాష్ట్రాల అవసరాల కోసం ఇక్కడ ఎన్ఐడీఎం పని చేస్తుందని ఎన్ఐడీఎం ఈడీ అనిల్కుమార్ అన్నారు. కృష్ణా జిల్లా కొండపావులూరులో జరిగిన జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అత్యున్నత స్థాయి శిక్షణ అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్ఐడీఎం ఏర్పాటు కోసం భూమి కేటాయించిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. 18 నెలల్లో భవనాలు పూర్తి చేసి ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభిస్తామన్నారు.