కర్ణాటక: హసన్లోని లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కుమారస్వామి పూజలు చేశారు. ఉదయం 1130 గంటలకు కుమారస్వామి ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. మధ్యాహ్నం 3:30 గంటలకు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్గాంధీతో సమావేశం కానున్నారు. సాయంత్రం 4:40 గంటలకు సోనియాగాంధీతో భేటీ కానున్నారు. ఈ నెల 23న తన ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారానికి వారిని కుమారస్వామి ఆహ్వానించనున్నారు. సాయంత్రం 6 గంటలకు బెంగళూరు తిరుగుప్రయాణం కానున్నారు.