అమరావతి: మరికాసేపట్లో అమరావతిలో 11 రాష్ట్రాల ప్రతినిధుల సమావేశం ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభోపన్యాసం చేయనున్నారు. 15వ ఆర్థిక సంఘానికి కేంద్రం నిర్దేశించిన విధివిధానాలను వ్యతిరేకిస్తూ ఈ సమావేశం నిర్వహిస్తున్న ఈ సమావేశంలో నిధుల పంపిణీలో జరుగుతున్న అన్యాయంపై ప్రతినిధులు చర్చించనున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం నిధులు కేటాయింపుపై 11 రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.