ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రారంభమైన 11 రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, May 07, 2018, 11:19 AM

అమరావతి :  అమరావతిలో 11 రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశం ప్రారంభమైంది. ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో జరుగుతున్న ఈ సమావేశానికి ఈ సమావేశానికి ఎపి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు స్వాగతం పలికారు. 15వ ఆర్థిక సంఘం టర్మ్స్‌ ఆఫ్‌ రిఫరెన్స్‌ (టిఒఆర్‌) వల్ల రాష్ట్రాలు ఆర్థిక స్వాతంత్య్రాన్ని కోల్పోతున్నాయని ఎపి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. కేవలం యుద్ధ సమయాల్లోనే ఇలాంటి విధానాలు అమలు చేయాల్సి ఉందని ఆయన అన్నారు. అయితే కేంద్రం సాధారణ సమయాల్లోనూ సమాఖ్య వ్యవస్థ దెబ్బ తీసేలా వ్యవహరిస్తోందని ఆయన చెప్పారు. కేంద్రం, రాష్ట్రాల సంబంధాలు ఎలా ఉండాలో సర్కారియా కమిషన్‌ స్పష్టంగా చెప్పిందని ఆయన అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com