ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దాచేపల్లి ఘటనే రాష్ట్రంలో చిట్టచివరి ఘటన కావాలి: మంత్రి ప్రత్తిపాటి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, May 07, 2018, 11:09 AM

దాచేపల్లి ఘటనే రాష్ట్రంలో చిట్టచివరి ఘటన కావాలని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. గుంటూరులో కలెక్టరేట్‌ నుంచి నిర్వహించిన ‘ఆడ బిడ్డకు రక్షగా కదులుదాం’ ర్యాలీలో మంత్రి పాల్గొని మాట్లాడారు. మన గడ్డపై ఇకపై ఇలాంటి ఆకృత్యాలు జరగడానికి వీల్లేదన్నారు. సీఎం ఇచ్చిన పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు నిర్వహిస్తున్నామన్నారు. కామాంధుల్లో మార్పు తీసుకొచ్చేలా.. నేరం చేయాలంటే భయపడేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఆడవారికి ఆంధ్రప్రదేశ్‌ సురక్షితమని చాటుదామన్నారు. ఆడవారిని దేవతా మూర్తులుగా భావించి పూజించే గొప్ప సంప్రదాయం మనదని పేర్కొన్నారు. వేధింపుల్లేని సమాజం కోసం ప్రజలను మేలుకొల్పుదామన్నారు. ఎవరైనా అత్యాచారానికి తెగబడితే మహిళలంతా ఏకమై తిరగబడాలన్నారు. ప్రతిపక్షాలు కుట్రరాజకీయాలు మానుకోవాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com