ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దాచేపల్లి అత్యాచార ఘటన ప్రతివారినీ కలచివేసింది : మంత్రి ఆనందబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, May 07, 2018, 11:07 AM

గుంటూరు :  దాచేపల్లిలో జరిగిన అత్యాచార ఘటన ప్రతి ఒక్కరినీ కలచివేసిందని మంత్రి ఆనందబాబు చెప్పారు. నేడు రాష్ట్రవ్యాప్తంగా ఆడబిడ్డకు రక్షగా కదలుదాం పేరిట ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆనందబాబు మాట్లాడుతూ మృతి తప్పదని తెలిసి నిందితుడు సుబ్బయ్య ఆత్మహత్య చేసుకున్నాడని అన్నారు. ప్రభుత్వం ఎంత కఠినంగా ఉందో దాచేపల్లి ఘటన రుజువు చేసిందని ఆయన చెప్పారు. ఇలాంటి ఘటనలు రాజకీయం చేయడం జగన్‌కే చెల్లిందని ఆయన విమర్శించారు. మన గడ్డపై ఇకపై ఇలాంటి అకృత్యాలు జరగడానికి వీల్లేదని ఆయన అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com