ఆంధ్రప్రదేశ్కు హోదా సాధించడానికి టిడిపి తమతో కలిసి రావాలని వైకాపా నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. పార్లమెంటు సాక్షిగా ఎపికి ప్రత్యేక హోదా ఇస్తామని ఆనాడు హామీ ఇచ్చారని ఆయన చెప్పారు. టిడిపి మాత్రం ప్యాకేజీ కావాలని కేబినెట్లో తీర్మానం చేసిందని ఆయన అన్నారు. ప్యాకేజీ ఇచ్చినందుకు ఢిల్లి వెళ్లి మరీ సన్మానాలు చేశారని ఆయన విమర్శించారు. ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి రాష్ట్ర ప్రయోజనాల కంటే సొంత ప్రయోజనాలే ఎక్కువయ్యాయని వైకాపా నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. హోదా కోసం తమ నాయకుడు, వైకాపా అధినేత జగన్ రాష్ట్ర వ్యాప్తంగా తిరుగులేని పోరాటం చేశారని ఆయన చెప్పారు. కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన సమయంలో టిడిపి యూటర్న్ తీసుకుందని ఆయన అన్నారు. టిడిపి తన ఎంపిల చేత ఎందుకు రాజీనామా చేయించలేకపోయిందని ఆయన ప్రశ్నించారు.