ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ ప్రజల చిరకాల ఆకాంక్ష పోలవరం: సీఎం చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 30, 2018, 11:25 AM

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రజల చిరకాల ఆకాంక్ష పోలవరం ప్రాజెక్టు అని సీఎం చంద్రబాబు అన్నారు. నీరు-ప్రగతిపై అధికారులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో చంద్రబాబు మాట్లాడుతూ పోలవరం పనులపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రతి జిల్లా నుంచి పోలవరం డ్యామ్‌ సైట్‌కు బస్సులు నడిపిస్తామన్నారు. విద్యార్థులు, పాత్రికేయులకు పోలవరం పనులు చూపించాలని అధికారులకు సూచించారు. 13 జిల్లాల్లో 13 జల సంరక్షణ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. చెరువుల్లో పూడికతీత, చెక్‌ డ్యాముల పనులు వేగవంతం కావాలన్నారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా అన్ని పట్టణాల్లో పర్యటిస్తానని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులను స్వయంగా పరిశీలిస్తానన్నారు. రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి ఆగకూడదని, హక్కుల కోసం పోరాడాలన్నారు. ఆస్పత్రుల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ఎక్కడా మురుగునీరు నిల్వ ఉండకూడదు, దోమల ఉత్పత్తిని నిర్మూలించాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com