సుకుమా: ఛత్తీస్గఢ్ సుకుమా జిల్లాలో జేగూర్గూడా అటవీప్రాంతంలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో మహిళా మావోయిస్టు మృతి చెందారు. మరో 15 మంది మావోయిస్టులు గాయపడినట్లు సమాచారం. నిన్న తెలంగాణ-ఛత్తీస్ఘడ్ సరిహద్దుల్లో మావోయిలు, గ్రేహౌండ్స్ బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 8మంది మావోయిస్టులు మృతి చెందగా, ముగ్గురు జవాన్లు గాయపడిన విషయం తెలిసిందే.