ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నష్టాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 23, 2018, 10:42 AM

దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఆసియా మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలతో సోమవారం ఉదయం ఈక్వెటీ మార్కెట్ల సూచీలు ఆరంభ ట్రేడింగ్‌లో రెడ్‌ మార్క్‌‌ను సూచిస్తున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ దాదాపు 50 పాయింట్లు నష్టపోయి 34,368 వద్ద, నిఫ్టీ 5 పాయింట్లు నష్టపోయి 10, 559 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఊగిసలాడుతున్న మార్కెట్లులో ఎక్కువ సానుకూలత రానుందని, నష్టపోయిన సూచీలు మళ్లీ పుంజుకునే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ రోజు ఉదయం బీఎస్ఈ సెన్సెక్స్ సూచీ.. గత సెన్సెక్స్ ముగిసిన మార్క్‌కు పైబడే దాదాపు 80 పాయింట్లతో ప్రారంభమైంది.


కానీ, నిఫ్టీ 10,550 మార్క్ వద్ద తేలుతున్నట్టు కనిపిస్తోంది. ఇతర రంగాల ఉప సూచీల్లో నిఫ్టీ మినహా అన్ని రెడ్‌ మార్క్‌‌లో స్వల్పంగా మాత్రమే ట్రేడింగ్‌ అవుతున్నాయి. ఐసీఐసీఐ బ్యాంకు, ఇన్ఫోసిస్, అధాని పోర్ట్స్ షేర్లు ఈ రోజు ఉదయం ట్రేడింగ్‌లో భారీ నష్టాల్లో కొనసాగుతుండగా, ఇండస్ఇండ్ బ్యాంక్, యస్ బ్యాంకు, భారతీ ఎయిర్‌టెల్ లాభాలు పండిస్తున్నాయి. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com