విజయవాడ, మేజర్న్యూస్ : ప్రతిపక్ష నేత జగన్ తీరును ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ ల సంఘం తీవ్రంగా ఖండించింది. మంగళవారం దివాకర్ ట్రావెల్ బస్సు ప్రమాద బాధితులను పరామర్శించేందుకు నందిగామ ప్రభుత్వాసుపత్రికి వచ్చి న జగన్ అక్కడ ఉన్న జిల్లా కలెక్టర్ బాబు.ఎ పట్ల అనుచితంగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. కలెక్టర్ అన్న గౌరవం లేకుండా జగన్ ప్రవర్తించారని ఐఏఎస్ అధికారులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై చర్చించేందుకు ఈరోజు ఐఏఎస్ల సంఘం అధ్యక్షుడు ఫరీదా ఆధ్వర్యంలో అధికారులు సచివాలయంలో సమా వేశం అయ్యారు. కృష్ణా జిల్లా నందిగామ ప్రభుత్వాసుపత్రిలో జరిగిన ఘటన ను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు ఐఏఎస్ల సంఘం పేర్కొంది. ఐఏఎస్ అధికారిని జైలుకు పంపుతామని ప్రతిపక్ష నేత జగన్ ఎలా కామెంట్ చేస్తారని అధికారులు ప్రశ్నించారు. నిన్నటి ఘటనపై చర్చిచేందుకు అమరావతిలోని సచివాలయంలో ఐఏఎస్ల సంఘం ఈరోజు సమావేశమైంది.
అనంతరం ఐఏఎస్ అధికారులు మాట్లాడుతూ నిన్న జరిగిన ఘటనను కలెక్టర్ బాబు పూర్తిగా వివరించారని తెలిపారు. అధికారులు పాలనా వ్యవస్థలో భాగమని వారిని కించపరుస్తూ మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కృష్ణా జిల్లాలో జరిగిన రహదారి ప్రమాదంపై ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి అధికారులతో ప్రవర్తించిన తీరు సరికాదని ఏపీ ఉద్యోగుల ఐకాస ఛైర్మన్ బొప్పరాజు వెంకటే శ్వర్లు అన్నా రు. విధి నిర్వహణలో ఉన్న అధికా రులతో జగన్ వ్యవహరించిన తీరును సంఘం తరఫున ఖండిస్తున్నామన్నారు.
జగన్పై నందిగామ పీఎస్లో కేసు
ప్రతిపక్ష నేత వ్కెఎస్ జగన్ సహా మరికొందరిపై కృష్ణా జిల్లా నందిగామ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. నందిగామ ప్రాంతీయ ఆస్పత్రి అభివద్ధి కమిటీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు 363 సెక్షన్ కింద నమోదు చేశారు. బుధవారం ముళ్లపాడు వద్ద జరిగిన దివాకర్ ట్రావెల్స బస్సు ప్రమాదంలో గాయాలపాలైన వారిని పరామర్శించేందుకు వచ్చిన జగన్ వైద్యు లపై దురుసుగా ప్రవర్తించారు.
మృతుల పోస్టుమార్టం రిపోర్టును వ్కెద్యుల నుంచి లాక్కునేందుకు ప్రయత్నిం చారు. వైద్యుల విధులకు ఆటంకం, దురుసు ప్రవర్తన కారణాలతో ఆస్పత్రి అభివద్ధి కమిటి పోలీసులకు ఫిర్యాదు చేసింది.