విజయవాడ, సూర్య బ్యూరో : వచ్చే ఆర్థిక సంవత్సరం 2017-18 బడ్జెట్లో బి.సి.ల బడ్జెట్ పెంచాలని కోరుతూ జాతీయ బి.సి.సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్.కష్ణయ్య, ఎ.పి.బి.సి.సంక్షేమ సంఘం రాష్ర్ట ప్రధాన కార్యదర్శి పోతిన వెంకట మహేష్ సంయుక్తంగా బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బి.సి. బడ్జెట్ను పెంచవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నదని వారు ఈ ప్రకటనలో తెలియజేశారు. రాబోయే ఆర్థిక సంవ త్సరంలో బి.సి.ల బడ్జెట్ పెంచి క్రింది పదుల వారీగా బడ్జెట్లో కేటాయించాలని కోరారు. బి.సి.ల అభివద్ధిపై చిత్తశుద్ధి ఉంటే రాష్ర్ట ప్రభుత్వం బి.సి. సంక్షేమ శాఖకు బడ్జెట్లో కేటాయింపులు పెంచాలని విజ్ఞప్తి చేశారు. బి.సి.ల అభివద్ధికై 10 వేల కోట్లతో సబ్-ప్లాన్ ఏర్పాటు చేసి అందులో అన్ని ప్రభుత్వ స్కీమ్లలో ముఖ్యంగా వ్యవసాయ సబ్సిడి స్కీమ్లు, హార్టికల్చర్ స్కీములు, ఉపాధి పథకా లు, గ్రామీణ అభివృద్ధి స్కీమ్లు, పంచాయతిరాజ్ స్కీమ్లు తదితర అన్ని సంక్షేమ పధకాలు అభివద్ధి పథకాలలో బి.సి. లకు జనాభా ప్రకారం 52 శాతం లబ్దిదారులను ఎంపికచేసి ఇదే నిష్పత్తిలో బడ్జెట్ను కేటాయించాలని కోరారు. బి.సి. కార్పొరేషన్కు ఏటా 2,000 కోట్ల కేటాయించాలి. ఎందుకంటే పరిశ్ర మలు - యంత్రాలు రావడంతో కుల వత్తులు దెబ్బతిన్నాయి. ప్రత్యామ్నా యంగా ఉపాధి కల్పించవలసిన అవసరం ఉందన్నారు. బి.సి. కులవత్తుల ఫెడరేషన్లు దాదాపు 11 ఉన్నాయి. ఈ ఫెడరేషన్లకు 2,000 కోట్ల కేటా యించాలి. ఈ కులాల జనాభా నిష్పత్తిలో బడ్జెట్ కేటాయింపులు జరగాలని కోరారు. వడ్జెర ఫెడరేషన్, రజక ఫెడరేషన్, నాయీబ్రాహ్మణ ఫెడరేషన్, విశ్వబ్రాహ్మణ ఫెడరేషన్, కుమ్మర, శాలీవాహన ఫెడరేషన్, వాల్మీకి, బోయ ఫెడరేషన్, సగర, ఉప్పర ఫెడరేషన్, మేదర కార్పొరేషన్, పూసల, కష్ణబలిజ ఫెడరేషన్, బట్రాజు ఫెడరేషన్ తదితర ఫెడరేషన్ లకు జనాభా దామాషా ప్రకారం నిధులు కేటాయించాలని కోరారు.
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 8 బి.సి. రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేయాలి. ఇంజనీరింగ్, ఎం.బి.ఏ., ఎం.సి.ఏ, పి.జి. కోర్సులు చదివే విద్యార్థుల మొత్తం ఫీజులను ప్రభుత్వమే భరించాలి. 2008లో వీరికి స్కీమ్ ప్రవేశపెట్టినపుడు ఉన్న మాదిరిగా యధావిధిగా అమలు చేయాలి. రాష్ర్టంలోని అద్దె భవనాల్లో ఉన్న బి.సి. హాస్టల్లకు సొంత భవనాల నిర్మాణానికి బడ్జెట్ కేటా యించాలి. పెరిగిన ధరలకు అనుగు ణంగా మెస్, కాస్మోటిక్ ఛార్జీలను పెంచాలని వారు డిమాండ్ చేశారు. సన్నబియ్యంతో భోజనం పెట్టాలి. కాలేజి విద్యారుల స్కాలర్షిప్లకు, ఫీజు రీ యింబర్సమెంట్కు, హాస్టల్ అడ్మిషన్ల కు, ఇతర సౌకర్యాలకు గరిష్ట ఆదాయ పరిమితిని 3 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు నెలకు రూ. 300 లు చొప్పున స్కాలర్షిప్ మంజూరు చేయాలి. దీని మూలముగా ప్రభుత్వ పాఠశా లలో విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలో చదివే బి.సి. విద్యార్థులకు ఫీజు రీయింబర్సమెంట్ పథకాన్ని అమలు పరచాలని కోరారు. కులాంతర వివాహాలు చేసుకునే దంపతులకు ఇచ్చే ప్రోత్సాహక పారితోషికం 10 వేలనుంచి 1లక్షకు పెంచాలని విజ్ఞప్తి చేశారు. జూనియర్ అడ్వకేట్లకు సాచురేషన్ పద్ధతిలో సై్టఫండ్గను నెలకు 8 వేల రూపాయలు చొప్పన ఇవ్వాలని కోరారు. బి.సి.స్టడీ సర్కిల్లకు బడ్జెట్ను 25 కోట్ల నుండి 150 కోట్లకు పెంచాలని విజ్ఞప్తి చేశారు.