హైదరాబాద్ : కేంద్రంతో కుమ్మక్కైతే హస్తినలో దీక్షలు ఎందుకు చేస్తామని వైకాపా ఎమ్మెల్యే రోజా అన్నారు. డిల్లీలో వైకాపా ఎంపీల దీక్షను పోలీసులు భగ్నం చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. ప్రత్యేక హోదాను ఇంత కాలం తుంగలోకి తొక్కి…అన్ని రాష్ట్రాల కంటే కేంద్రం మనకే ఎక్కువే ఇచ్చిందంటూ అసెంబ్లీలో చెప్పిన చంద్రబాబు ఈ నాడెందుకు కేంద్రంపై కాలుదువ్వుతున్నారని రోజా ప్రశ్నించారు. ఎన్నికలు వస్తున్నాయనే చంద్రబాబు ఇప్పడు మళ్లీ చంద్రన్న పెళ్లి కానుక అంటూ కబుర్లు చెబుతున్నారని రోజా విమర్శించారు. హోదా అంశాన్ని, హోదా పోరాటాన్ని డైవర్ట్ చేయడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆమె విమర్శించారు. 30 సార్లు ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు ఎన్ని సార్లు హోదా గురించి అడిగారో చెప్పాలన్నారు. ఓటుకు నోటు కేసును తప్పించుకోవడానికే ఆయన హస్తిన యాత్రలు చేశారని విమర్శించారు.