చండీగఢ్ : అకాల వర్షాలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. పంజాబ్లోని అమృత్ సర్, ఆనంద్పూర్ సాహిబ్, ధూరి, ఫరీద్కోట్ అండ్ నంగల్తోపాటు హర్యానాలోని డాబ్వాలీ, కురుక్షేత్ర, పెహోవా, భీవాణి, కైతాల్, ఝాజ్జర్, కర్నాల్, పంచుకుల ప్రాంతాల్లో రెండు రోజులుగా భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులతో కూడిన వర్షం ధాటికి రెండు రాష్ర్టాల్లో గోధుమ పంట పెద్ద మొత్తంలో దెబ్బతిన్నది. దీంతో గోధుమ రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట కీలక దశలో ఉన్న సమయంలో వర్షాలు పడొద్దని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నట్లు పాటియాలాకు చెందిన రైతు దిలావర్ సింగ్ తెలిపారు. ఈదురుగాలులు, వర్షంతో భారీగా పంట నష్టపోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.